పెబ్బేరులో ఆస్తి పన్ను కట్టలేదని ఇల్లు సీజ్

పెబ్బేరులో ఆస్తి పన్ను కట్టలేదని ఇల్లు సీజ్
  •     పెబ్బేరు పట్టణంలోని రూ.3.49 లక్షలు బకాయి

పెబ్బేరు, వెలుగు: రెండేళ్లుగా ఆస్తి పన్ను చెల్లించని ఓ ఇంటిని పెబ్బేరు మున్సిపల్​అధికారులు మంగళవారం సాయంత్రం సీజ్​చేశారు.  పెబ్బేరు పట్టణ శివారులోని పీజేపీ క్యాంపునకు ఎదురుగా పట్టణానికి చెందిన ఎం.రమేశ్ అనే వ్యక్తికి పలుమార్లు నోటీసులు ఇచ్చినా..  తన ఇంటికి సంబంధించి రెండేళ్లుగా ఆస్తి పన్ను చెల్లించడం లేదని మున్సిపల్​అధికారులు తెలిపారు. దాదాపు రూ.3.49 లక్షల బకాయి ఉన్నారని, కట్టకపోవడంతో మంగళవారం సీజ్​ చేసినట్లు మేనేజర్​ గణేష్​ బాబు తెలిపారు.